WTC Rankings: స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో 0-2 తేడాతో సిరీస్ వైట్వాష్ కావడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్కు (WTC Rankings) చేరుకునే భారతదేశం అవకాశాలకు పెద్ద దెబ్బ తగిలింది. పాయింట్స్ టేబుల్లో భారత్ ఐదవ స్థానానికి పడిపోయింది. బుధవారం గౌహతిలో జరిగిన రెండో టెస్టులో 408 పరుగుల తేడాతో ఓటమి, సాంప్రదాయ ఐదు రోజుల ఫార్మాట్లో పరుగుల పరంగా భారత్కు అత్యంత భారీ ఓటమిగా నమోదైంది.
ఈ ఓటమి కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్తో సిరీస్ను డ్రా చేసుకున్న భారత జట్టు.. పాకిస్తాన్ కంటే కిందకు జారిపోయి ఐదవ స్థానంలో నిలిచింది. దీంతో వారి PCT (విజయ శాతం) 48.15కి తగ్గింది. ప్రస్తుత WTC సైకిల్లో భారత్ ఇప్పటివరకు తొమ్మిది టెస్ట్ మ్యాచ్లు ఆడింది. అందులో నాలుగు గెలిచింది. నాలుగు ఓడింది. ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది. వచ్చే ఏడాది ఆగస్టులో భారత్, శ్రీలంకలో రెండు మ్యాచ్ల సిరీస్లో పర్యటిస్తుంది. ఆ తర్వాత అక్టోబర్-నవంబర్లో న్యూజిలాండ్తో సిరీస్ ఆడుతుంది.
మరోవైపు 25 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికా భారత్లో మొట్టమొదటి టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించడం, పాయింట్స్ టేబుల్లో ప్రొటీస్ స్థానాన్ని బలోపేతం చేసింది. ప్రస్తుత WTC ఛాంపియన్స్ అయిన దక్షిణాఫ్రికా ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా వెనుక నాలుగు టెస్టుల నుండి 36 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. వారి PCT 66.67 నుండి 75కి మెరుగుపడింది. తొలి ఎడిషన్ ఛాంపియన్లు న్యూజిలాండ్ ఈ సైకిల్లో ఇంకా ఒక్క సిరీస్ కూడా ఆడలేదు. కాగా శ్రీలంక, పాకిస్తాన్ ఒక్కొక్క సిరీస్ ఆడాయి. 2027లో జరిగే ఫైనల్కు టాప్ రెండు జట్లు అర్హత సాధిస్తాయి.
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక
- ఆస్ట్రేలియా
- దక్షిణాఫ్రికా
- శ్రీలంక
- పాకిస్తాన్
- భారత్
