LPG Gas Price: ప్రభుత్వం దేశంలోని నిరుపేద, అవసరమైన ప్రజలకు సహాయం అందించడానికి అనేక పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY)ను ప్రారంభించింది. దీని కింద ప్రభుత్వం 14.2 కిలోగ్రాముల సిలిండర్పై (LPG Gas Price) రూ. 300 వరకు సబ్సిడీని ఇస్తోంది. అంటే మీరు గ్యాస్ సిలిండర్ను రూ. 300 తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ సబ్సిడీ కేవలం PM ఉజ్వల యోజన కింద జాబితా చేయబడిన వారికి మాత్రమే లభిస్తుందని గుర్తుంచుకోండి. మీరు ఈ పథకంలో నమోదు చేసుకోకపోతే మీకు సబ్సిడీ లభించదు.
ఏజెన్సీ నుండి సిలిండర్ కొనుగోలు చేసేటప్పుడు మీరు పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుందని గమనించండి. సబ్సిడీ మొత్తం కొద్ది రోజుల్లో కస్టమర్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది. ఒక నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా ప్రజలు PM ఉజ్వల యోజనలో నమోదు చేసుకున్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 1.75 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో నమోదు చేసుకున్నారు.
సబ్సిడీ తర్వాత సిలిండర్ ధర ఎంత ఉంటుంది?
సబ్సిడీ తర్వాత వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ చాలా చౌకగా లభిస్తుంది. ఢిల్లీలో రెగ్యులర్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 853 కాగా, లక్నోలో రూ. 890 వరకు ఉంది. మీరు PM ఉజ్వల యోజనలో నమోదు చేసుకుంటే మీకు రూ. 300 సబ్సిడీ లభిస్తుంది. అంటే సబ్సిడీ తర్వాత ఢిల్లీలో మీకు సిలిండర్ మొత్తం రూ. 553, లక్నోలో రూ. 590 లకు లభించవచ్చు.
ఒక సంవత్సరంలో ఎన్ని సిలిండర్లపై సబ్సిడీ పొందవచ్చు?
PM ఉజ్వల యోజన కింద మీరు పరిమిత సంఖ్యలో వంట గ్యాస్ సిలిండర్లపై మాత్రమే రూ. 300 సబ్సిడీని పొందవచ్చు. ప్రతి సంవత్సరం కేవలం 9 సిలిండర్లపై మాత్రమే సబ్సిడీ లభిస్తుంది. అయినప్పటికీ దీనికి ముందు ప్రభుత్వం ప్రతి సంవత్సరం 12 సిలిండర్లపై రూ. 200 సబ్సిడీని ఇచ్చేది. కానీ సిలిండర్ల సంఖ్యను తగ్గించి, సబ్సిడీ మొత్తాన్ని పెంచింది. హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ ధర రూ. 905గా ఉంది. PM ఉజ్వల యోజనలో నమోదు చేసుకుంటే మీకు రూ. 300 సబ్సిడీ లభిస్తుంది. అంటే మనకు 605 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లభిస్తుంది.
